AP ప్ర‌జ‌ల‌కు,జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్|Ap Governor Says Sorry To Jagan!

2019-07-23 599

Governor Narasimhan say sorry to AP Public and CM jagan. AP Govt given fare well to Narasimhan for hie services to AP. Narasimhan praised Jagan Administration in 45 days time.
#apgovt
#Governornarasimhan
#defections
#ministers
#telanagana
#secretariat
#APPublic
#CMJagan
#farewell


ఒక భావోద్వేగ స‌న్నివేశం. తొమ్మిదేళ్ల‌కు పైగా రికార్డు స్థాయిలో గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన వ్య‌క్తి. ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న వ్య‌క్తి ఇప్పుడు తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. దీంతో..ఆయ‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం వీడ్కోలు స‌భ‌ను ఏర్పాటు చేసింది. ఆ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ భావోద్వేగానికి గుర‌య్యారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబు తూనే..క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అంత‌టితో ఆగ‌లేదు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ప్ర‌త్యేంగా క్ష‌మాప‌ణలు కోరుతున్నానంటూ స‌భా వేదిక‌గా చెప్పుకొచ్చారు. గ‌వ‌ర్న‌ర్ ప‌రిధి దాటి కొన్ని విష‌యాల్లో వ్య‌వ‌హ‌రించానంటూ వ్యాఖ్యానించారు. అయితే, గ‌వ‌ర్న‌ర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు..ప్ర‌త్యేకంగా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌టానికి..ఆయ‌న భాషలోని భావం చూస్తే.. ఆ రెండు కార‌ణా లే ప్ర‌ధానం గా క‌నిపిస్తున్నాయి. గ‌వ‌ర్న‌ర్‌లో ఒక ర‌కంగా ప‌శ్చాత్తాపం క‌నిపించింది.